పెరిగిన సిమెంట్ ధరలు.. బస్తాపై రూ.20 నుంచి రూ.50కి పెంపు

మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (11:04 IST)
నిర్మాణ రంగంపై పెరిగిన ధరలు ప్రభావం పడనుంది. తాజాగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సిమెంట్ ధరలు భారీగా పెరిగాయి.
ఈ నెల 1 నుంచి సిమెంట్ బస్తాపై రూ.20 నుంచి రూ.50 వరకు పెరిగింది.

ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 50 కిలోల బస్తా ధర బ్రాండ్‌ను బట్టి రూ.310 నుంచి రూ.400 వరకు ఉంది. 
 
గతేడాది నవంబర్ వరకు డిమాండ్ తక్కువగా ఉండటంతో కంపెనీలు రేట్లను తగ్గించాయి. ఈ ఏడాది నుంచి డిమాండ్ పెరగడంతో పాటు ముడి పదార్థాల రేట్లు పెరగడంతో ధరలు పెంచడం తప్పట్లేదని కంపెనీలు చెబుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు