యాక్సిస్ బ్యాంక్‌తో క్లియర్‌ట్రిప్ భాగస్వామ్యం

మంగళవారం, 22 ఆగస్టు 2023 (22:15 IST)
ఫ్లిప్‌కార్ట్ కంపెనీకి చెందిన క్లియర్‌ట్రిప్, భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఒకటైన యాక్సిస్ కలసి  క్లియర్‌ట్రిప్ ద్వారా బుకింగ్ చేసుకునే బ్యాంక్ ప్రస్తుత, కొత్త యాక్సిస్ బ్యాంక్‌ క్రెడిట్ కార్డుదారులకు ప్రయాణ ప్రయోజనాలను అందించడానికి ఒక విశిష్ట ప్రతిపాదనను పరిచయం చేయడానికి భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఈ సహకారం వినియోగదారులకు దేశీయ విమాన బుకింగ్‌ల కోసం అనేక ప్రత్యేక సదుపాయాలను అందిస్తుంది. ఇందులో రూ.1200 వరకు విలువైన సీట్లు, రూ. 500 వరకు విలువైన ఉచిత భోజనం, కన్వీనియెన్స్ ఫీజు మినహాయింపు, సిటి ఫ్లెక్స్ మ్యాక్స్ కింద కేవలం ఒక్క రూపాయితో విమానాలను రద్దు చేయడం, రీషెడ్యూల్ చేసే ఎంపిక ఉన్నాయి. అంతేగాకుండా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుదారులు ప్రయోజనాలను ఆస్వాదించడానికి పాయింట్లను సేకరించడం/రిడీమ్ చేయడం కోసం వేచి ఉం డాల్సిన అవసరం లేకుండా ప్రత్యేకంగా క్యూరేటెడ్ ట్రావెల్ ఆఫర్‌లను యాక్సెస్ చేయవచ్చు.
 
ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం దేశీయ విమానాల కోసం బుకింగ్ తగ్గింపుల సంప్రదాయ ప్రమాణాల నుండి పూర్తి నిష్క్రమణను సూచిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో, చాలా ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీలు బ్యాంకులతో భాగస్వామ్యం ద్వారా తక్షణ నగదు తగ్గింపులను అందించడంపై దృష్టి సారించాయి. అయినప్పటికీ, అవి గణనీయమైన సౌకర్యాల రుసుముల వసూలు, సీట్లు, భోజనాలకు అదనపు ఛార్జీలను విధించడం ద్వారా ఈ తగ్గింపులను భర్తీ చేస్తాయి. ఇంకా, అవి తరచుగా ఫ్లెక్సిబుల్ బుకింగ్‌ల కోసం ప్రీమియంను డిమాండ్ చేస్తాయి. కేవలం రద్దులు లేదా తేదీ మార్పులకు మాత్రమే పరిమితమవుతాయి. దీనికి విరుద్ధంగా, రూ.1 నామ మాత్రపు రుసుముతో సమగ్రమైన సేవలను అందించడం ద్వారా మా ప్రోగ్రామ్ ప్రత్యేకంగా నిలుస్తుంది. పెంచిన కన్వీని యెన్స్ రుసుముతో భారీ తగ్గింపులు పొందే అవసరాన్ని ఈ విధానం తొలగిస్తుంది.
 
ఈ భాగస్వామ్యం గురించి క్లియర్‌ట్రిప్ సీఈఓ అయ్యప్పన్ ఆర్ మాట్లాడుతూ, “పారదర్శక, కస్టమర్-కేంద్రిత వి ధానం ద్వారా ఓటీఏ విభాగంలో సంచలనం కలిగించడంలో క్లియర్‌ట్రిప్ లోతుగా పెట్టుబడి పెట్టబడింది. యాక్సిస్ బ్యాంక్‌తో మా భాగస్వామ్యం ఈ నిబద్ధతకు పొడిగింపు. ఇందులో ఎలాంటి అదనపు ఖర్చులు లేకుండా సౌ కర్యవంతమైన బుకింగ్‌లు, రద్దు ఎంపికలు, తేదీ మార్పులు వంటి ఫీచర్లు ఉంటాయి. ఈ ప్రత్యేకమైన ప్రతిపాద న నిజంగా మార్కెట్‌లో మమ్మల్ని వేరు చేస్తుంది. 12.5 మిలియన్ల వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఇది సిద్ధంగా ఉంది’’ అని అన్నారు

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు