స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు

శుక్రవారం, 20 అక్టోబరు 2023 (14:51 IST)
పసిడి ప్రియులకు చేదువార్త. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. శుక్రవారం ఉదయం ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో బంగారం రేట్లు ఎలా వున్నాయంటే...10 గ్రాముల 22క్యారెట్ల బంగారం రూ. 55,700 కాగా, 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ. 60,760 వద్ద కొనసాగుతుంది. 
 
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,850 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర రూ. 60,910కు చేరింది. మరోవైపు వెండి ధర కాస్త ఊరటనిచ్చింది. కిలో వెండి ధర రూ.77,500గా ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు