లండన్ వీధుల్లో నీరవ్ మోదీ.. హ్యాపీగా నవ్వుతూ.. నో కామెంట్ అంటూ..?

శనివారం, 9 మార్చి 2019 (11:00 IST)
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు సుమారు 13వేల కోట్ల రుణాలను ఎగవేసిన నీరవ్‌ పరారీలో వున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా బిలియనీర్ నీరవ్ మోదీ.. లండన్ వీధుల్లో తిరుగుతూ కనిపించాడు. బ్రిటన్‌లో మళ్లీ వజ్రాల వ్యాపారం ప్రారంభించినట్లు తెలుస్తోంది. 
 
అత్యంత ఖరీదైన జాకెట్ వేసుకున్న నీరవ్ మోదీ.. లండన్‌లోని బిజీ వీధిలో నడుస్తూ కనిపించాడు. క్యాబ్ కోసం ఎదురుచూస్తున్న నీవర్ వెంట.. ప్రశ్నల వర్షం కురిపిస్తూ రిపోర్టర్ వెళ్లాడు. అయితే విలేకరులతో మాట్లాడేందుకు నీరవ్ అంగీకరించలేదు. 
 
కాగా లండన్‌లోని వెస్ట్ఎండ్‌లో ఉండే సోహో ప్రాంతంలో నీరవ్ కొత్తగా డైమండ్ వ్యాపారం మొదలుపెట్టినట్లు ద టెలిగ్రాఫ్ వెల్లడించింది. తాజాగా నీరవ్ మోదీతో ఓ విలేకరి అడిగిన ప్రశ్నలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.  ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్నారా అని అడిగిన ప్రశ్నకు కూడా ఆయన సమాధానం దాటవేశాడు. ఏ ప్రశ్న అడిగినా నో కామెంట్స్ అంటూ తన పని తాను చేసుకున్నాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు