బైడెన్‌ జోరు.. 50,000 మార్కును దాటి రికార్డు

గురువారం, 21 జనవరి 2021 (10:59 IST)
స్టాక్ మార్కెట్‌కు గురువారం కలిసొచ్చింది. కరోనా వైరస్‌తో ఆర్థిక వ్యవస్థ కుదేలు.. డిమాండ్‌ పతనం.. ఇవన్నీ బీఎస్‌ఈలో బుల్‌ దూకుడును అడ్డుకోలేకపోయాయి. ఎట్టకేలకు నేడు తొలి సారి 50,000 మార్కును దాటి రికార్డు సృష్టించింది. 
 
గురువారం ఉదయం దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాలతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఉదయం 9.29 సమయంలో సెన్సెక్స్‌ 306 పాయింట్ల లాభంతో 50,098 వద్ద నిఫ్టీ 92 పాయింట్ల లాభంతో 14,736 వద్ద ట్రేడవుతున్నాయి. ప్రధాన రంగాల సూచీల్లోని అన్ని రంగాల్లో ఉత్సాహం కనిపిస్తోంది.
 
గేట్‌వే డిస్ట్రిపార్క్స్‌, ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌, జేకే టయర్స్‌, సూర్య రోష్ని లిమిటెడ్‌, హవేల్స్‌ ఇండియా షేర్లు భారీ లాభాల్లో ఉండగా.. వీఎస్‌టీ ఇండస్ట్రీస్‌, ఎల్‌అండ్‌టీ టెక్నాలజీస్‌,జీఎంఎం , ఆగ్రోటెక్‌ ఫూడ్స్‌, టాటా ఎలిక్సిలు భారీ నష్టాల్లో ఉన్నాయి.
 
బైడెన్‌ జోరు..
బుధవారం అమెరికాలో బైడెన్‌ సర్కారు ప్రమాణ స్వీకారం చేయడం మార్కెట్లో జోరును నింపింది. ముఖ్యంగా ట్రంప్‌ విధించిన ఆర్థిక ఆంక్షలు తొలగే అవకాశాలు ఉండటమే దీనికి ప్రధాన కారణం. మరో భారీ ఆర్థిక ప్యాకేజీ అమెరికాలో వెలువడే అవకాశం ఉడటం కూడా సూచీల్లో ఉత్తేజం నింపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు