కాల్ ట్యాక్సీ ధరలను పెంచేసిన ఉబెర్

శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (20:28 IST)
ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన దండయాత్ర కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు బ్యారెల్ ధర భారీగా పెరిగిపోయింది. ఈ ప్రభావం ఇతర దేశాలపై పడింది. ముఖ్యంగా భారత్‌పై కూడా చూపించింది. ఫలితంగా దేశంలో ఇంధన ధరలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. దేశంలోనే అత్యధిక ధర ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నాయి. 
 
ఈ ధరల ప్రభావం నిత్యావసర వస్తు ధరలపై కూడా పడింది. ఈ నేపథ్యంలో క్యాబ్ సేవల్లో ప్రముఖ సంస్థగా పేరొందిన ఉబెర్ తన రేట్లను పెంచేసింది. ప్రస్తుతం ఉన్న రేట్లకు అదనంగా 15 శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది. అయితే, ఈ పెంచిన ధరలు కేవలం ఒక్క ముంబైకు మాత్రమే పరిమితం చేస్తున్నట్టు తెలిపింది. పెట్రోల్, డీజల్ ధరలు పెరుగుతున్నందున వాటికి అనుగుణంగానే తమ సేవల రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించింది. కాగా, త్వరలోనే ఈ పెంచిన రేట్లను దేశ వ్యాప్తంగా అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

 

App-based cab firm Uber says it has raised fares by 15 per cent for travel in Mumbai to offset impact of rising fuel prices

— Press Trust of India (@PTI_News) April 1, 2022

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు