రేషన్ షాపుల్లో చిన్న సిలిండర్లు : కేంద్రం యోచన

గురువారం, 28 అక్టోబరు 2021 (12:50 IST)
దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఉన్న రేషన్ షాపుల్లో చిన్నపాటి సిలిండర్లను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. రేషన్‌ షాపుల ఆదాయం పెంపు చర్యల్లో భాగంగా ఈ ప్రతిపాదన చేసినట్టు పేర్కొన్నది. 
 
కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సుధాంశు పాండే బుధవారం రాష్ర్టాల అధికారులతో వర్చువల్‌గా భేటీ అయ్యారు. సిలిండర్ల అమ్మకానికి రేషన్‌ షాపులకు ముద్రా పథకం కింద నిధులు అందించాలని కేంద్రం యోచిస్తున్నట్టు ఆమె తెలిపారు.
 
కాగా, కేంద్ర ఆహార కార్యదర్శి సుధాన్షు పాండే అధ్యక్షతన జరిగిన వర్చువల్ సమావేశంలో ఈ అంశాలను రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించారు. ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ, పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. 
 
యూపీ సీఎం యోగి సంచలన నిర్ణయం ఇదికాకుండా సీఎస్సీ ఈ-గవర్నెన్స్ సర్వీస్ ఇండియా లిమిటెడ్‌తో పాటు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు