ఎయిరిండియాలో విస్తారా విలీనం..

మంగళవారం, 29 నవంబరు 2022 (20:05 IST)
ఎయిరిండియా సంస్థ బిలియన్ డాలర్ల కంపెనీగా ఎదగనుంది. ఎయిరిండియాలో విస్తారా ఎయిర్‌లైన్స్ విలీనం కానుంది. ఇందుకు టాటా సన్స్, సింగపూర్ ఎయిర్ లైన్స్ అంగీకారం తెలిపాయి. ఈ విలీన ప్రక్రియను 2024 మార్చి నాటికి పూర్తి చేయాలని గడువును నిర్దేశించుకున్నట్లు తెలుస్తోంది. 
 
టాటాతో జాయింట్ వెంచర్‌లో వున్న విస్తారాలో మైనారిటీ వాటాను కలిగి ఉన్న సింగపూర్ ఎయిర్‌లైన్స్, విస్తరించిన ఎయిర్ ఇండియాలో దాదాపు 25 శాతం వాటాను కలిగి ఉంటుంది. ఇది రూ. 2వేల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనుంది.
 
ప్రస్తుతం, విస్తారాలో 51 శాతం వాటా టాటా వద్ద ఉండగా, సింగపూర్ ఎయిర్‌లైన్స్ 2013లో ఏర్పాటు చేసిన జాయిన్ వెంచర్‌లో మిగిలిన 49 శాతాన్ని కలిగి ఉంది. ఇది విమానాల సంఖ్యను 218కి పెంచుతుంది. 
 
ఎయిర్ ఇండియా ప్రస్తుతం 113 విమానాలను, ఎయిర్ ఏషియా ఇండియా 28, విస్తారా 53, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 24తో కలిపి విమానాల సంఖ్య ఈ డీల్ ద్వారా పెరుగుతుంది. తద్వారా భారతదేశపు అతిపెద్ద అంతర్జాతీయ క్యారియర్, రెండవ అతిపెద్ద దేశీయ క్యారియర్‌గా ఎయిరిండియా మారుతుందని టాటా సన్స్ తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు