31 నుంచి విజయవాడ నుంచి షార్జాకు డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్

శుక్రవారం, 28 అక్టోబరు 2022 (12:56 IST)
విజయవాడ నుంచి షార్జా వెళ్లే ప్రయాణికులకు ఇది నిజంగానే శుభవార్త. ఈ నెల 31వ తేదీ నుంచి ఈ రెండు ప్రాంతాల మధ్య డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసును ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ నడుపనుంది. 31వ తేదీ సోమవారం సాయంత్రం 6.35 గంటలకు విజయవాడ నుంచి షార్జాకు తొలి విమాన సర్వీసు బయలుదేరి వెళ్లనుంది. ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణ చార్జీ ప్రారంభ ధర రూ.13,669గా నిర్ణయించారు. 
 
అయితే, షార్జా నుంచి విజయవాడకు వచ్చేందుకు మాత్రం రూ.8,946గా నిర్ణయించింది. యూఏఈ దేశాలైన దుబాయ్, నార్త్రన్ ఎమిరేట్స్ వెళ్లే ప్రయాణికులకు ఈ డైరెక్ట్ విమాన సర్వీసు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సీఈఓ అలోక్ సింగ్ తెలిపారు. షార్జాతో పాటు మస్కట్ కువైట్‌లకు కూడా తమ సంస్థ విజయవాడ నుంచి నేరుగా విమాన సర్వీసును నడుపుతుందని ఆయన వివరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు