హైదరాబాద్‌లో స్పెక్స్‌బంకర్‌తో కలిసి జిస్ విజన్ సెంటర్‌ను ప్రారంభించిన జిస్ గ్రూప్

ఐవీఆర్

శనివారం, 6 ఏప్రియల్ 2024 (19:02 IST)
దాదాపు 178 సంవత్సరాలుగా ఆప్టిక్స్, ఆప్టోఎలక్ట్రానిక్స్‌ సైన్స్‌లో ప్రపంచ వ్యాప్తంగా అగ్రగామిగా ఉన్న జిస్, స్పెక్స్‌బంకర్‌తో కలిసి, ఈ రోజు, హైదరాబాద్‌లో తమ మొదటి జిస్ విజన్ సెంటర్‌ను ప్రారంభించినట్లు వెల్లడించింది. దాదాపు 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో, హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ నడిబొడ్డున ఉన్న ఈ ప్రతిష్టాత్మక సెంటర్, ఈ ప్రాంతంలోని వినియోగదారులకు అత్యాధునిక కంటి సంరక్షణ పరిష్కారాలను అందించడంలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది.
 
అత్యున్నత-నాణ్యత కలిగిన నేత్ర సంరక్షణ ఉత్పత్తులు, సేవలను అందించడంలో తమ నిబద్ధత కోసం స్పెక్స్‌బంకర్ చాలాకాలంగా గుర్తింపు పొందింది. ఈ విజన్ సెంటర్ పరిచయంతో, హైదరాబాద్‌లోని కస్టమర్‌లు ఇప్పుడు తమ వ్యక్తిగత, వృత్తిపరమైన అవసరాలకు అనుగుణంగా ప్రపంచ స్థాయి కంటి సంరక్షణ పరిష్కారాలను పొందవచ్చు. విజన్ సెంటర్ విస్తృత శ్రేణిలో జిస్ లెన్స్‌లను ప్రదర్శిస్తుంది. ఖచ్చితత్వం, స్పష్టత, అధునాతన సాంకేతికతకు ప్రసిద్ధి చెందినవి జిస్ లెన్స్‌లు. ఈ కేంద్రాన్ని సందర్శించే కస్టమర్‌లు అత్యాధునిక రోగనిర్ధారణ పరికరాలను ఉపయోగించి సర్టిఫైడ్ ఆప్టోమెట్రిస్ట్‌లచే నిర్వహించబడే సమగ్ర కంటి పరీక్షల నుండి ప్రయోజనం పొందవచ్చు.
 
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్పెక్స్‌బంకర్ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీ మోహిత్ అగర్వాల్ మాట్లాడుతూ, “దాదాపు 2 సంవత్సరాల క్రితం బెంగుళూరులో మేము విజయవంతంగా జిస్ సెంటర్‌ను ప్రారంభించాము. దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. ఆ స్పందన అందించిన ఉత్సాహంతో  హైదరాబాద్‌లో మొదటి జిస్ విజన్ సెంటర్‌ను పరిచయం చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాము. ఈ వ్యూహాత్మక విస్తరణ, వృద్ధికి సంబంధించి మా లక్ష్యంతో సంపూర్ణంగా సమలేఖనం చేయబడింది, హైదరాబాద్ యొక్క శక్తివంతమైన మార్కెట్‌లో అగ్రశ్రేణి ఉత్పత్తులు, అత్యాధునిక ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల కోసం తిరస్కరించలేని డిమాండ్‌ను నొక్కి చెబుతుంది.
 
మేము కళ్లజోళ్ల పరిశ్రమను పునర్నిర్వచించడంతో పాటుగా భారతదేశంలో కంటి సంరక్షణ ప్రమాణాలను పెంచడం కొనసాగిస్తున్నందున, విజన్ సెంటర్ను ప్రారంభించడం మా ప్రయాణంలో ఒక కీలక ఘట్టాన్ని సూచిస్తుంది. ఈ నూతన కేంద్రం అసమానమైన నాణ్యత, ఆవిష్కరణలను అందజేస్తూ,  హైదరాబాద్‌లో మా వివేకవంతులైన వినియోగదారుల అంచనాలను అందుకోవడమే కాకుండా వాటిని అధిగమిస్తుందని మేము విశ్వసిస్తున్నాము" అని అన్నారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు