న్యూఢిల్లీ ఐఐటీలో ఉద్యోగ అవకాశాలు.. దరఖాస్తుల ఆహ్వానం

ఆదివారం, 13 నవంబరు 2022 (11:18 IST)
న్యూఢిల్లీలోని ఇంజనీరింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో వివిధ రకాల ఉద్యోగా భర్తీ కోసం నోటిఫికేషన్ జారీచేసింది. ఈ పోస్టుల్లో సూపరింటెండెంట్ ఇంజనీరింగ్, మెడికల్ ఆఫీసర్, ప్రిన్సిపల్ టెక్నికల్ ఆఫీసర్. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. 
 
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదేని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా ఇనిస్టిట్యూట్ నుంచి ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ విభాగాల్లో బ్యాచిలర్స్ లేదా మాస్టర్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సుల్లో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే, సంబంధిత పనిలో అనుభవం కలిగివుండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 40 నుంచి 55 యేళ్లకు మించరాదు. 
 
అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో విధానంలో ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు రుసుంగా రూ.500 అపరాధం చెల్లించాల్సివుంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. పూర్తి వివరాల కోసం అధికార నోటిఫికేషన్ చెక్ చేసుకోవాలి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు