తెలంగాణ నుండి వచ్చే ఐదేళ్లలో వార్షిక అప్లికేషన్ వృద్ధిని లక్ష్యంగా చేసుకున్న లేహై యూనివర్శిటీ

ఐవీఆర్

శుక్రవారం, 18 అక్టోబరు 2024 (23:27 IST)
యునైటెడ్ స్టేట్స్‌, పెన్సిల్వేనియాలోని బెత్లెహెమ్‌లోని ఒక ప్రైవేట్ రీసెర్చ్ యూనివర్శిటీ అయిన లెహై యూనివర్సిటీ మరియు ప్రపంచంలోనే మొట్టమొదటి ఎడ్-ఫిన్‌టెక్ ఏఐ ఆధారిత ప్లాట్‌ఫారమ్ అయిన గ్రాడ్ రైట్ తో కలిసి నెక్స్ట్‌ఇన్‌టెక్ తొలి ఎడిషన్‌ను నిర్వహించాయి. ఈ కార్యక్రమం, భారతదేశంలో సాంకేతిక రంగాన్ని తీర్చిదిద్దటంలో నేటి ఔత్సాహిక గ్రాడ్యుయేట్ విద్యార్థుల వినూత్న స్ఫూర్తిని గుర్తించి, వేడుక చేసింది. దాదాపు 200 మందికి పైగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నుండి అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల అధికంగా పాల్గొన్నారు. బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్‌లో తమ నైపుణ్యం ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో బివి రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నర్సాపూర్, సిబిఐటి, బిట్స్-హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, విఎన్ఆర్విజెఐఈటి మరియు మహీంద్రా యూనివర్సిటీతో సహా 20కి పైగా భారతీయ విశ్వవిద్యాలయాలు సైతం పాల్గొన్నాయి.
 
2024-2025 విద్యా సంవత్సరానికి నమోదు చేసుకున్న విద్యార్థులలో 10-15% పెరుగుదలతో పాటు తెలంగాణా నుండి విద్యార్థుల దరఖాస్తులలో 25-30% పెరుగుదలను లేహై విశ్వవిద్యాలయం లక్ష్యంగా పెట్టుకుందని లెహై యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్‌కు డిప్యూటీ ప్రోవోస్ట్ మరియు నెక్స్ట్‌ఇన్‌టెక్ హోస్ట్ సబ్రినా జెడ్లికా అన్నారు. ఈ కార్యక్రమం కోసం గ్రాడ్‌రైట్‌తో భాగస్వామ్యం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. లేహై వద్ద, తమ కమ్యూనిటీలోకి మరింత మంది భారతీయ విద్యార్థులను స్వాగతించడానికి తాము ఎదురుచూస్తున్నామన్నారు. తరువాతి తరం గ్లోబల్ టెక్ లీడర్‌లకు భారతదేశంలోని ప్రతిభ పునాది వేస్తుందని తాము నమ్ముతున్నామన్నారు. 
 
ఈ సందర్భంగా గ్రాడ్‌రైట్ సహ వ్యవస్థాపకుడు అమన్ సింగ్ మాట్లాడుతూ, “తదుపరి తరం ఆవిష్కర్తలకు సాధికారత కల్పించేందుకు తమ నిబద్ధతను నెక్స్ట్‌ఇన్‌టెక్ సూచిస్తుందన్నారు. నెక్స్ట్‌ఇన్‌టెక్ లో భాగంగా పలు హ్యాకథాన్‌లు నిర్వహించారు. వీటిలో పాల్గొన్నవారు రూ. 2 లక్షల బహుమతి కోసం పోటీ పడ్డారు, అలాగే మొదటి ముగ్గురు ఫైనలిస్టుల కోసం లెహై ఇండియా ఇన్నోవేటర్స్ అవార్డులు అందిస్తారు.
 
ఈ కార్యక్రమంలో అకాడెమియా మరియు పరిశ్రమకు మధ్య వారధిగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక ప్రతిభ రేపటి శ్రామిక శక్తిని ఎలా రూపొందిస్తుంది అనే అంశం పై ప్యానెల్ చర్చ లెహై యూనివర్శిటీకి చెందిన సబ్రినా జెడ్లికా మరియు డాక్టర్ కె.వి.ఎన్. సునీత, ప్రిన్సిపాల్, బివిఆర్ఐటి మధ్య జరిగింది. ఈ కార్యక్రమంలో ఐఐఐటి హైదరాబాద్ నుండి టివి దేవీప్రసాద్ మరియు శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ నుండి రవిచంద్రన్ రాజగోపాల్ కూడా పాల్గొన్నారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు