ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 5G నెట్‌వర్క్‌లో జియో ఆధిపత్యం

ఐవీఆర్

శుక్రవారం, 18 అక్టోబరు 2024 (17:33 IST)
5G నెట్‌వర్క్ ఎక్స్పీరియన్స్‌లో రిలయన్స్ జియో నెంబర్‌వన్‌గా అవతరించింది. 5G నెట్‌వర్క్ కవరేజ్ మరియు లభ్యత...  రెండింటిలోనూ జియో అద్భుతమైన పనితీరును ప్రదర్శిచింది. ఓపెన్ సిగ్నల్ తాజాగా విడుదల చేసిన నివేదికలో, ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్ (ఆంధ్ర, తెలంగాణల)లో జియో యొక్క అసాధారణమైన పనితీరును హైలైట్ చేసింది.
 
ఓపెన్ సిగ్నల్ నివేదిక ప్రకారం, జియో యొక్క 5G కవరేజ్ టవర్లు 66.7% నెట్‌వర్క్ లభ్యత స్కోర్‌తో దాని పోటీదారుల కంటే ఎక్కువగా ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లోని జియో వినియోగదారులు మూడింట రెండు వంతుల సమయం 5G సేవలను యాక్సెస్ చేయగలరు, ఇది దాని సమీప ప్రత్యర్థితో (24.4%) పోలిస్తే చాలా ఎక్కువ. విస్తృతమైన మరియు స్థిరమైన 5G కనెక్టివిటీని అందించడంలో జియో ముందంజలో ఉందని నివేదిక పేర్కొంది. ఫలితంగా ఈ ప్రాంతంలోని వినియోగదారులు హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలతో పాటు వీడియో స్ట్రీమింగ్, గేమింగ్ మరియు వివిధ అప్లికేషన్‌లలో ఉత్తమ అనుభవాన్ని పొందవచ్చని వివరించింది.
 
5G కవరేజ్ అనుభవంలో కూడా ఆంధ్ర, తెలంగాణలలో జియో ముందుంది. 10 పాయింట్ల స్కేల్‌పై జియో 9.0 పాయింట్ల స్కోర్‌తో తన పోటీదారు ఎయిర్‌టెల్ (7.1 స్కోర్‌) కంటే ముందుకు వెళ్ళింది. ఈ సంఖ్యలు జియో యొక్క విస్తృతమైన నెట్‌వర్క్‌ను...  వివిధ ప్రదేశాలలో నిరంతరాయమైన సేవలను అందించడంలో సామర్ధ్యాన్ని వివరిస్తాయి. అదే సమయంలో, Vodafone Idea (Vi) మరియు BSNL వరుసగా 3.7, 1.2 స్కోర్‌లతో గణనీయంగా వెనుకబడి ఉన్నాయి, ఈ ప్రాంతంలో 5G కవరేజీని విస్తరించడంలో వారి సవాళ్లను నొక్కిచెప్పాయి.
 
జియో ద్వారా అత్యుత్తమ 5G లభ్యత, కవరేజీ వల్ల వినియోగదారులు వేగవంతమైన డౌన్‌లోడ్‌లు పొందడంతో పాటు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రెండింటిలో నివాసితులు, వ్యాపారాలకు మెరుగైన నెట్‌వర్క్ అనుభవం కలుగుతుంది. జియో యొక్క గణనీయమైన ఆధిక్యంతో, వినియోగదారులు అధిక-వేగవంతమైన ఇంటర్నెట్‌కు మెరుగైన సేవలను ఆశించవచ్చు.

వెబ్దునియా పై చదవండి