ఈఎస్ఐ కార్పొరేషన్‌లో ఉద్యోగ అవకాశాలు

ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) వైద్య విభాగంలో వివిధ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. హోమియోపతి విభాగంలో మెడికల్ ఆఫీసర్ పోస్టుకు 30 యేళ్ళలోపు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీలో హోమియోపతి ఉత్తీర్ణతతో పాటు సెంట్రల్ లేదా స్టేట్ రిజిస్టర్ ఆఫ్ హోమియోపతిలో తమ పేరును నమోదు చేసుకుని ఉండాలి. ఎంపికైన అభ్యర్థికి రూ.15,600 నుంచి 39,100 రూపాయల వేతన స్కేలును అందజేస్తారు.

అలాగే, హోమియోపతి ఫార్మాసిస్ట్ పోస్టు కోసం సీనియర్ సెకండరీ లేదా డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆస్పత్రుల్లో రెండేళ్ళపాటు విధిగా హోమియోపతిక్ ఫార్మాసిస్ట్‌గా అనుభవం గడించి ఉండాలి. అభ్యర్థి వయస్సు 25 సంవత్సరాలు మించి ఉండరాదు.

మెడికల్ ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.220 (ఎస్సీ, ఎస్టీ రూ.125) ఈఎస్ఐ కార్పొరేషన్ పేరిట న్యూఢిల్లీలో చెల్లేలా డీడీని దరఖాస్తుతో జతచేయాల్సి వుంటుంది. అలాగే, ఫార్మాసిస్ట్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.75 డీడీని జత చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. పూర్తి చేసిన దరఖాస్తులను ఈనెల 29వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు అందజేయాల్సి ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి