ఉస్మానియా యూనివర్శిటీలో జాబ్‌మేళా

రాష్ట్ర రాజధానిలో జాబ్‌మేళా జరుగనుంది. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్ గవర్నెన్స్‌ (ఐఈజీ), జవహర్‌ నాలెడ్జ్‌ సెంటర్ ‌(జేకేసీ)ల ఆధ్వర్యంలో మూడు రోజులపాటు ‘జాబ్‌ ఫెయిర్‌’ జరుగుతుంది. ఇందుకోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఈ జాబ్ ఫెయిర్ మూడు దశలుగా జరుగుతుంది. ఈ నెల 17వ తేది, 21, డిసెంబర్‌ ఒకటో తేదీల్లో సికింద్రాబాద్‌లోని పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కళాశాల (ఉస్మానియా విశ్వవిద్యాలయం)లో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగనుంది.

ఈ జాబ్‌ ఫెయిర్‌లో మీడియా, రిటెయిల్‌, సేల్స్‌, మార్కెటింగ్‌, బ్యాంకింగ్‌, ఐటీ, విద్య, టెలికాం తదితర రంగాలకు చెందిన సత్యం, విప్రో, సదర్‌లాండ్‌, సీటెల్‌, 24/7 కస్టమర్‌, టాటా బిజినెస్‌ సపోర్ట్‌, టీఎంఐ నెట్‌వర్క్స్‌, చోళమండలం, డిజిటల్‌ నిర్వాణలకు సంబంధించి సుమారు 500 స్వదేశీ, అంతర్జాతీయ సాఫ్ట్‌వేర్ కంపెనీలు పాల్గొంటాయి. ఈ విషయాన్ని జాబ్‌ఫెయిర్ నిర్వాహకులు ఐఈజీ డైరెక్టర్‌ డాక్టర్‌ పి.మాధవ్‌ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.

వెబ్దునియా పై చదవండి