ఢిల్లీలోని ప్రముఖ "మహానగర్ టెలీఫోన్ నిగమ్ లిమిటెడ్" సంస్థ కింద తెలిపిన ఉద్యోగాల భర్తీకోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగాలకుగానూ అభ్యర్థుల వయోపరిమితి సెప్టెంబర్ 1, 2008 నాటికి 21-30 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాగే ఏ పోస్టుకైనా కనీసం 60 శాతం మార్కులతో అభ్యర్థులు ఉత్తీర్ణులై ఉండాలి.
ఇక ఉద్యోగాల వివరాల్లోకి వస్తే...
1. జూనియర్ టెలికాం ఆఫీసర్స్ (ట్రైనీ) : ఇందులో 250 పోస్టులు ఖాళీగా ఉండగా... అభ్యర్థులు ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ కమ్యూనికేన్స్/ఐటీలో బీఈ/బీటెక్ చేసి ఉండాలి.
2. జూనియర్ టెలికాం ఆఫీసర్స్ (ట్రైనీ) : ఖాళీలు 10. అభ్యర్థులు సివిల్ ఇంజనీరింగ్లో బీఈ/బీటెక్ చేసి ఉండాలి.
3. జూనియర్ టెలికాం ఆఫీసర్స్ (ఎలక్ట్రికల్) (ట్రైనీ) : ఖాళీలు 10. అభ్యర్థులు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బీఈ/బీటెక్లలో ఉత్తీర్ణులై ఉండాలి.
4. జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్ (ట్రైనీ) : ఖాళీలు 80, అభ్యర్థులు సీఏ/ఐసీడబ్ల్యూఏలలో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా, బీకాం చేసి సీఏలో కనీసం ఐదేళ్ల అనుభవం కలిగి ఉండాలి.
5. మేనేజ్మెంట్ ట్రైనీ (మార్కెటింగ్) : పోస్టులు 30. పోస్టు గ్రాడ్యుయేషన్తో పాటు రెండేళ్ల పని అనుభవం లేదా మార్కెటింగ్ ప్రధానాంశంగా ఏంబీఏ/పీజీడీబీఎం చేసి ఉండాలి.
6. మేనేజ్మెంట్ ట్రైనీ (హ్యూమన్ రిసోర్సెస్) : ఖాళీలు 10. అభ్యర్థులు పోస్టు గ్రాడ్యుయేషన్తో పాటు రెండేళ్ల పని అనుభవం లేదా పర్సనల్/హెచ్ఆర్ ప్రధానాంశంగా ఎంబీఏ/పీజీడీబీఎం/ఎంఎస్డబ్ల్యూ చేసి ఉండాలి.
7. మేనేజ్మెంట్ ట్రైనీ (లీగల్) : ఖాళీలు ఒకటి. వీరు ఏదైనా గ్రాడ్యుయేషన్తో పాటు ఎల్ఎల్బీ చేసి ఉండాలి.
8. మేనేజ్మెంట్ ట్రైనీ (కంపెనీ సెక్రటరీ) : ఖాళీలు ఒకటి. వీరు గ్రాడ్యుయేషన్తో పాటుగా, ఐసీఎస్ఐ అసోసియేట్ మెంబర్షిప్ కలిగి ఉండాలి.
ఈ ఉద్యోగాలపై ఆసక్తి కలిగిన అభ్యర్థులు, కంపెనీ కోరిన అన్ని అర్హతలు కలిగి ఉన్నట్లయితే... "మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్, న్యూఢిల్లీ" పేరుతో 500 రూపాయల డిమాండ్ డ్రాఫ్ట్ను, ఇదే అడ్రస్సుకు పంపాల్సి ఉంటుంది. డీడీలను పంపాల్సిన ఆఖరు తేదీ అక్టోబర్ 18, 2008.