ఎన్‌పీసీఐఎల్‌లో 250 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు

ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్) 250 ఎగ్జిక్యూటివ్ ట్రైనీల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులు శిక్షణ విజయవంతంగా పూర్తిచేస్తే సైంటిఫిక్ ఆఫీసర్లుగా నియమితులవుతారు.

ఎన్‌పీసీఐఎల్‌లో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్ విభాగాల్లో ఖాళీలున్నాయి. ఈ ఖాళీలకు ఈనెల 22వ తేదీ నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను ఏప్రిల్ ఒకటో తేదీలోపు పంపాల్సి ఉంటుంది.

అలాగే, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్)లో మొత్తం 162 డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు
దరఖాస్తు చేసుకువో అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్థతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగివుండాలి.

వెబ్దునియా పై చదవండి