సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

దేవీ

మంగళవారం, 17 జూన్ 2025 (17:52 IST)
Phanindra Narsetti
మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన '8 వసంతాలు'  చిత్రానికి ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించారు. అనంతిక సునీల్‌కుమార్ లీడ్ రోల్ పోషించారు. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన 8 వసంతాలు సోల్‌ఫుల్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం జూన్ 20న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి సినిమా విశేషాలు పంచుకున్నారు.
 
'మను' సినిమా తర్వాత ఆరేళ్లు గ్యాప్ వచ్చింది కదా... ఇంత టైం పట్టడానికి కారణం?
-కొన్ని కథలపై వర్క్ చేశాను. అయితే '8 వసంతాలు' మెయిన్ ప్రాయారిటీ. స్త్రీ కోణంలోకి వెళ్లి ఆ సున్నితత్వాన్ని పట్టుకోవడానికి, కథ రాయడం కంటే స్త్రీ దృక్కోణాన్ని డెవలప్ చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టింది.
 
-ఒక బలమైన స్త్రీ పాత్ర చుట్టూ కథను చెప్పాలని అనిపించింది. మా అత్తయ్యలు, ఇంట్లో, చుట్టుపక్కల చాలా బలమైన స్త్రీ పాత్రల మధ్య పెరిగాను. ఎప్పటినుంచో ఆ దృక్కోణం ఉంది. ఈ ఫిల్మ్ తో ఒక పూర్ణస్థాయి తీసుకోవాలనిపించింది.
 
ఇంత బరువైన పాత్ర కోసం అనంతిక సునీల్‌కుమార్‌ను ఎంపిక చేయడానికి కారణం?
-నేను రాసుకున్న పాత్రకు అనంతిక పర్ఫెక్ట్ యాప్ట్. కేవలం నటిగానే కాదు, దాదాపు 13 కళలలో ఆమెకు ప్రవేశం ఉంది. తనకి మార్షల్ ఆర్ట్స్ వచ్చు. తను ఈ పాత్రను ఎలా చేస్తుందో అనే డౌట్ ఎప్పుడూ లేదు. తను చక్కగా తెలుగు మాట్లాడుతుంది. శుద్ధి అయోధ్య పాత్రకు పూర్తి న్యాయం చేసింది.
 
-భాషను బ్రతికించే శక్తి సినిమాకే ఉంది. సినిమాకి ఒక పవర్ ఉంది. ఎవరో ఒకరు ఆ భాష చూసి ఇష్టాన్ని పెంచుకోవచ్చు. నేను ఒక ప్రయత్నం చేశాను. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఎంతోమంది అభినందిస్తూ మెసేజులు చేస్తున్నారు.
 
ఈ సినిమా తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్ చేయాలని అనుకుంటున్నారు?
-కంప్లీట్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ‘మను’ చేశాను. ఇప్పుడు ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్‌లో ఫిల్మ్ చేశాను. నాకు ఈ రెండు అనుభవాలూ ఉన్నాయి. ఈ రెండింటి సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని, తర్వాత డిసైడ్ చేసుకుంటాను.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు