'మను' సినిమా తర్వాత ఆరేళ్లు గ్యాప్ వచ్చింది కదా... ఇంత టైం పట్టడానికి కారణం?
-కొన్ని కథలపై వర్క్ చేశాను. అయితే '8 వసంతాలు' మెయిన్ ప్రాయారిటీ. స్త్రీ కోణంలోకి వెళ్లి ఆ సున్నితత్వాన్ని పట్టుకోవడానికి, కథ రాయడం కంటే స్త్రీ దృక్కోణాన్ని డెవలప్ చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టింది.
-ఒక బలమైన స్త్రీ పాత్ర చుట్టూ కథను చెప్పాలని అనిపించింది. మా అత్తయ్యలు, ఇంట్లో, చుట్టుపక్కల చాలా బలమైన స్త్రీ పాత్రల మధ్య పెరిగాను. ఎప్పటినుంచో ఆ దృక్కోణం ఉంది. ఈ ఫిల్మ్ తో ఒక పూర్ణస్థాయి తీసుకోవాలనిపించింది.
ఇంత బరువైన పాత్ర కోసం అనంతిక సునీల్కుమార్ను ఎంపిక చేయడానికి కారణం?
-నేను రాసుకున్న పాత్రకు అనంతిక పర్ఫెక్ట్ యాప్ట్. కేవలం నటిగానే కాదు, దాదాపు 13 కళలలో ఆమెకు ప్రవేశం ఉంది. తనకి మార్షల్ ఆర్ట్స్ వచ్చు. తను ఈ పాత్రను ఎలా చేస్తుందో అనే డౌట్ ఎప్పుడూ లేదు. తను చక్కగా తెలుగు మాట్లాడుతుంది. శుద్ధి అయోధ్య పాత్రకు పూర్తి న్యాయం చేసింది.
ఈ సినిమా తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్ చేయాలని అనుకుంటున్నారు?
-కంప్లీట్ ఇండిపెండెంట్ ఫిల్మ్ మను చేశాను. ఇప్పుడు ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్లో ఫిల్మ్ చేశాను. నాకు ఈ రెండు అనుభవాలూ ఉన్నాయి. ఈ రెండింటి సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని, తర్వాత డిసైడ్ చేసుకుంటాను.