భారత వైమానిక దళలంలో ఉద్యోగాలు పొందగోరే స్త్రీ, పురుషులకు ఓ శుభవార్త. ఆరో పురుషుల, 35వ మహిళల షార్ట కమిషన్ (ఎస్ఎస్పి) పైలట్ కోర్సుల్లో ఎంట్రన్స్ కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంట్రన్స్ పరీక్షలో నెగ్గిన వారికి.. ఈ కోర్సు 2010 జూలైలో ప్రారంభించనున్నారు.
వివరాలు: ఈ కోర్సులో పొందగోరే అభ్యర్థులు 60 శాతం మార్కులతో ఏదేని డిగ్రీ లేదా బీఈ లేదు బీటెక్ చేసి ఉండాలి. వీరు ఇంటర్మీడియెట్లో లెక్కలు, ఫిజిక్స్ సబ్జెక్టులను కలిగి ఉండాలి. డిగ్రీ లేదా బీఈ లేదా బీటెక్లో ఆఖరు సంవత్సరం లేదా.. ఫైనల్ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులైనా ఈ కోర్సు ప్రవేశానికి ధరఖాస్తు చేసుకోవచ్చు.
అవివాహితులై ఉండాలి. వయసు.. స్త్రీ, పురుషులిద్దరికీ.. 2010, జూలై 1 నాటికి 19 నుంచి 23 ఏళ్ల లోపు ఉండాలి. అంటే.. ఈ కోర్సులో ప్రవేశం కోసం ధరఖాస్తు చేసుకునే అభ్యర్థి.. 1987, జూలై 2 నుంచి 1991, జూలై 1వ తేదీ మధ్యన జన్మించిన వారై ఉండాలి. ఎత్తు కనీసం.. 162.5 సెం.మీ ఉండి ఉండాలి. దృష్టి లోపం ఉండరాదు.
ఇక వేతనం.. రూ. 15,600 నుంచి రూ. 39,100 వరకు. ఉంటుంది. దీనికి అదనంగా... మిలిటరీ అలవెన్సులు, గ్రేడ్ పే వంటివి కూడా చేరుస్తారు.
అభ్యర్థుల ఎంపిక విధానం: పైలెట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్ (పీఏబీటీ)లో ఎంపికై.. ఆ తర్వాత సర్వీస్ సెలెక్షన్ బోర్డ్ (ఎస్ఎస్బి) ఇంటర్వూ ముగిసిన అనంతరం ఎంపికైన అభ్యర్థులకు 74 వారాల పాటు శిక్షణ ఇస్తారు. ధరఖాస్తులు.. 5/10/2009 వరకు స్వీకరిస్తారు. దరఖాస్తు ఎలా చేసుకోవాలి: పైన పేర్కొనబడిన వివరాల ప్రకారం ఏ4 సైజు పేపరపై అభ్యర్థులు తమకు సంబంధించి పూర్తి వివరాలు తెలపి, స్వంత చిరునామా గల రెండు ఎన్వలప్ కవర్లకు సరిపడ స్టాంపులు అతికించి జత చేయాలి. వీటిని ఓ ధరఖాస్తు కవరులో ఉంచాలి. ధరఖాస్తు కవరుపై '6ఎస్ఎస్సీ (ఎం)/35 ఎస్ఎస్సీ (డబ్ల్యూ) ఎఫ్ (పీ) కోర్సు' అని రాసి కింద పేర్కొనబడిన చిరునామాకు పంపాలి. పోస్ట్ బ్యాగ్ నెం. 001, నిర్మాణ్ భవన్ పోస్టాఫీసు, న్యూఢిల్లీ - 110 106. మరిన్ని వివరాలు పొందగోరు వారు.. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూడాట్కెరీర్ఎయిర్ఫోర్స్డాట్నిక్ఇన్లో చూడండి.