రాష్ట్రంలోని ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అలాగే, మెకానికల్ ఇంజనీరింగ్లో 13, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్లో 12, కంప్యూటర్ ఇంజనీరింగ్లో 9, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో 6, టైక్స్టైల్ టెక్నాలజీ ఇంజనీరింగ్లో 3, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 2, ఇంగ్లీష్, కెమిస్ట్రీలలో ఐదు చొప్పున, గణితంలో ఆరు, ఫిజిక్స్లో ఐదు పోస్టులను భర్తీ చేయనున్నాయి.
దరఖాస్తు చేయదలచుకునే అభ్యర్థులు 18 నుంచి 39 సంవత్సరాల వయస్సులోపు వారై ఉండాలి. ఇంజనీరింగ్ పోస్టుల కోసం సంబంధిత విభాగంలో ప్రథమ శ్రేణిలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. నాన్ ఇంజనీరింగ్ విభాగంలో మొదటి శ్రేణీ పిజీ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తులను ఈనెల 30వ తేదీలోగా ఆన్లైన్లో పంపాల్సి ఉంటుంది.