"హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్" (హెచ్ఏఎల్) బెంగళూరులోని వివిధ విభాగాల్లో ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీ కోసం ఓ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
ఉద్యోగాల ఖాళీల విషయానికొస్తే... డిజైన్ ట్రైనీస్ వంద, మేనేజ్మెంట్ ట్రైనీస్ 175 ఖాళీలు ఉన్నాయి. ఇందుగానూ విద్యార్హతలు.. డిజైన్ ట్రైనీస్కయితే, గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుండి కనీసం 65 శాతం (ఎస్సీ, ఎస్టీలైతే 55 శాతం) మార్కులతో మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో ఉత్తీర్ణులై ఉండాలి.
అలాగే మేనేజ్మెంట్ ట్రైనీలయితే... గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుండి కనీసం 65 శాతం (ఎస్సీ, ఎస్టీలైతే 55 శాతం) మార్కులతో మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ఏరోనాటికల్ లేదా ప్రొడక్షన్ లేదా కంప్యూటర్ సైన్స్... ఇంజనీరింగ్లో ఉత్తీర్ణులై ఉండాలి.
కాగా, ఎరోనాటికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు మాత్రం కనీసం 60 శాతం (ఎస్సీ, ఎస్టీలైతే 50 శాతం) మార్కులతో పాసయితే సరిపోతుంది. ఈ పోస్టులకు అక్టోబర్ 24, 2008లోపు హెచ్ఏఎల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.హలిండియా.కామ్/కెరీర్స్ను చూడగలరు.