"నిట్"లో పలు కొత్త కోర్సులు ప్రారంభం

శనివారం, 11 అక్టోబరు 2008 (13:40 IST)
FileFILE
వరంగల్ జిల్లాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో పలు రకాల కొత్త కోర్సులను ప్రారంభించినట్లు నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ వైవి రావు వెల్లడించారు.

నిట్ సంస్థ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో వైవిరావు మాట్లాడుతూ... ఎంటెక్‌లో ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ ఇంకా ఆటోమొబైల్ ఇంజనీరింగ్, అడ్వాన్స్‌డ్ కమ్యూనికేషన్స్ సిస్టమ్స్‌లో కొత్త కోర్సులను ప్రారంభించినట్లు పేర్కొన్నారు.

రాబోయే ఐదేళ్లలో నానో టెక్నాలజీ, బయో, మెటీరియల్ టెక్నాలజీలలో కూడా కొత్త కోర్సులను ప్రారంభించనున్నట్లు వైవిరావు తెలియజేశారు. అంతేగాకుండా త్వరలో సిరామిక్, మైనింగ్ టెక్నాలజీ, ఎనర్జీ మేనేజ్‌మెంట్‌లో బీటెక్ కోర్సులు కూడా రానున్నాయని ఆయన తెలిపారు.

వెబ్దునియా పై చదవండి