నోటిఫికేషన్: బీఎస్ఎన్ఎల్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీలు

దేశంలో టెలికాం రంగ దిగ్గజ సంస్థ అయిన భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) మేనేజ్‌మెంట్ ట్రైనీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 300 ఖాళీలను భర్తీ చేసేందుకు బీఎస్ఎన్ఎల్ సమాయత్తం అవుతోంది.

వివరాలు
టెలికాం ఆపరేటర్లు.. టెలీకమ్యూనికేషన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా బీఈ ఎలక్ట్రికల్ లేదా బీటెక్‌ లేదా ఐటీ లేదా కంప్యూటర్స్‌తో పాటు రెండు సంవత్సరాల ఫుల్‌టైం ఎంబీఏ చేసి ఉండాలి.
టెలికాం ఫైనాన్స్... సీఏ లేదా ఐసీడబ్ల్యూఏ లేదా సీఎస్ చేసి ఉండాలి.
వయసు... 2009, ఆగస్టు 1వ తేదీ నాటికి 30 ఏళ్లలోపు వయసు ఉన్నవారై ఉండాలి. ఇందులో ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్ల వయోపరిమితి, ఓబీసీలకు మూడేళ్లు, ఫిజికల్ హ్యాండీకాప్‌ (పీహెచ్‌సీ)లకు పదేళ్ల వరకు వయోపరిమితి సడలింపు ఉంటుంది.
ఖాళీలు.. తీరుతెన్నులు
మేనేజ్‌మెంట్ ట్రైనీ ఖాళీలు మొత్తం 300 ఉన్నాయి. అందులో టెలికాం ఆపరేటర్లు.. 250. ఇందులో ఎస్సీలకు 38 సీట్లు, ఎస్టీలకు 18 సీట్లు, ఓబీసీలకు 68 సీట్లు, జనరల్ కోటాలో 126 సీట్లను కేటాయించారు.
ఇక టెలికాం ఫైనాన్స్... మొత్తం 50. ఇందులో ఎస్సీలకు 7 సీట్లు, ఎస్టీలకు 3 సీట్లు, ఓబీసీలకు 13 సీట్లు, జనరల్ కోటాలో 27 సీట్లను కేటాయించారు.
వేతన చెల్లింపులు.. రూ. 24,900/- నుంచి రూ. 50,500/- వరకు ఉంటుంది.
ఎంపిక చేసుకునే విధానం.. రాత పరీక్ష, మౌఖిక పరీక్ష, గ్రూప డిస్కషన్స్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.
ధరఖాస్తుతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన 'టెలికాం సర్కిల్‌ ఏ.ఓ. (క్యాష్), బీఎస్ఎన్ఎల్, ఆఫీస్ ఆఫ్ ది సీజీఎంటీ, ఏ.పీ. హైదరాబాద్'. పేరిట రూ. 1,500/- డీడీని జతచేయాలి. ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌లకు ఫీజులో యథావిధిగా మినహాయింపు ఉంటుంది.
అభ్యర్థులు... వెబ్‌సైట్ నుంచి ధరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ధరఖాస్తులు పంపవలసిన ఆఖరు తేదీ.. 2009, అక్టోబర్ 14.
మరిన్ని వివరాల కోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూడాట్‌బీఎస్ఎన్ఎల్‌డాట్‌కో‌డాట్‌ఇన్ చూడండి.
ధరఖాస్తులు పంపవలసిన చిరునామా
డీజీఎం (అడ్మినిస్ట్రేషన్), ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్, సెకెండ్ ఫ్లోర్, దూరసంచార్ భవన్, నాంపల్లి స్టేషన్ రోడ్, అబిడ్స్, హైదరాబాద్- 500 001. ఫోన్: 040- 23203213

వెబ్దునియా పై చదవండి