పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అసిస్టెంట్ ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్‌మెన్‌ విభాగంలో మొత్తం 12 ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు 18 నుంచి 39 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థలు దరఖాస్తు చేసుకోవచ్చు.

అలాగే, 25 సర్వేయర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. భారతీయ స్టేట్ బ్యాంకులో రూ.80 చలానా చెల్లించాల్సి వుంటుంది. ఎస్సీ, ఎస్టీ, విద్యార్థులకు చలానా ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. దరఖాస్తులను ఏప్రిల్ 30వ తేదీలోగా పంపాలి.

వెబ్దునియా పై చదవండి