"మెడికల్ లేబొరేటరీ"లో ప్రవేశానికై దరఖాస్తులు

శనివారం, 25 అక్టోబరు 2008 (17:33 IST)
FileFILE
ప్రస్తుత విద్యా సంవత్సరం 2008-09కిగానూ రెండేళ్ల మెడికల్ లేబొరేటరి టెక్నాలజీ డిప్లొమాలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంచే నడుపబడుతున్న హైదరాబాదులోని ఐపీఎం కాలేజ్ ఆఫ్ ఎంఎల్ టీ వారు ఈ దరఖాస్తులను కోరుతున్నారు.

ఈ కోర్సులో చేరేందుకు కనీస విద్యార్హత, పదో తరగతి చదివి ఉండాలి. దరఖాస్తు ఫారాలను వెబ్‌సైట్ నుండి అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారాలను పూర్తి చేసిన అభ్యర్థులు కౌన్సెలింగ్ సమయంలో దాఖలు చేస్తే సరిపోతుంది. కౌన్సెలింగ్ సమయంలో "డైరెక్టర్, ఐపీఎం- ఛైర్‌పర్సన్, ఐపీయం కాలేజ్ ఆఫ్ ఎంఎల్‌టీ" పేరుతో హైదరాబాద్‌లో చెల్లే విధంగా 200 రూపాయల డీడీని కూడా చెల్లించాల్సి ఉంటుంది.

ఇదిలా ఉంటే... ఈ కోర్సులకుగానూ అభ్యర్థి 9,500 రూపాయల ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన, సంవత్సరాదాయం లక్ష రూపాయల లోపు ఉన్న అభ్యర్థులు మాత్రం 3,500 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది.

ఆసక్తిగల అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లతో పాటు "ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఆవరణ, నారాయణగూడ, హైదరాబాద్-29" అనే చిరునామాలో అక్టోబర్ 31వ తేదీ, 2008 ఉదయంపూట 9 గంటలకు నిర్వహించే కౌన్సెలింగ్‌కు హాజరుకాగలరు. మిగతా వివరాలకు హెచ్‌టీటీపీ://ఐపీయం.ఏపీ.నైక్.ఇన్ అనే వెబ్‌సైట్‌ను చూడగలరు.

వెబ్దునియా పై చదవండి