కావలసిన పదార్థాలు : పనీర్.. పావు కేజీ వెల్లుల్లి.. పది గ్రా. మైదా.. వంద గ్రా. ఉప్పు.. తగినంత రీఫైన్డ్ ఆయిల్.. సరిపడా టమోటో సాస్.. 3 టీ. కారం.. పావు టీ. కార్న్ఫ్లోర్.. 50 గ్రా. అజినమోటో.. చిటికెడు పాలు.. రెండు కప్పులు
తయారీ విధానం : పనీర్ను రెండున్నర అంగుళాల సైజులో ముక్కలుగా కోసి ప్లేటులో అమర్చాలి. వాటిపై టమోటో సాస్, సన్నగా తరిగిన వెల్లుల్లి, కారం, ఒక టీస్పూన్ కార్న్ఫ్లోర్, ఒక టీస్పూన్ మైదా కలిపి పది నిమిషాలపాటు ఉంచాలి. ఒక గిన్నెలో కార్న్ఫ్లోర్, మైదా, పాలు కలిపి జారుడు పిండిలా చేయాలి. అందులోనే తగినంత ఉప్పు, అజినమోటో వేసి కలపాలి.
వేడిగా ఉండే మూకుడులో గరిటెడు పిండిని పలుచని అట్టులా పోసి స్టవ్మీద పెట్టి ఉడికిస్తే పాన్ కేక్ తయారవుతుంది. దీనిని సన్నగా రిబ్బన్లాగా కత్తిరించి ఉంచాలి. ఇప్పుడు దీనిపై నానబెట్టి ఉంచిన ఒక్కో పనీర్ ముక్కను పెట్టి చుట్టాలి. అలా మొత్తం చేశాక బాగా కాగుతున్న నూనెలో పోసి ఎర్రగా వేయించి తీస్తే.. రిబ్బన్ పనీర్ రెడీ..! వీటిని వేడిగా సాస్తో కలిపి ఆరగించాలి.