కావలసిన పదార్థాలు : పిజ్జా బేస్లు.. రెండు మష్రూమ్స్.. వంద గ్రా. టొమోటో.. ఒకటి క్యాప్సికమ్.. ఒకటి ఉప్పు, మిరియాలు.. తగినంత టొమోటో సాస్.. రెండు టీ. వెన్న.. ఒక టీ. పెద్ద ఉల్లిపాయ.. ఒకటి నూనె.. ఒక టీ. జున్ను.. అర కప్పు
తయారీ విధానం : మష్రూమ్స్ను (పుట్టగొడుగులు) శుభ్రం చేసి, తరిగి ముక్కలుగా చేయాలి. నూనె వేడిచేసి పుట్టగొడుగులు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, మిరియాలను వేసి వేయించాలి. పిజ్జా బేస్లకు వెన్న, వాటిపై టొమోటో సాస్లను రాయాలి. ఆపై వేయించిన మష్రూమ్స్ మిశ్రమాన్ని పరచాలి. దానిపైన టొమోటో, క్యాప్సికమ్ ముక్కల్ని అమర్చి, జున్నును కలపాలి. వీటిని అలాగే మైక్రోవేవ్ ఓవెన్లో ఉంచి జున్ను కరిగిన తరువాత తీసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే మష్రూమ్స్ పిజ్జా రెడీ..!