ఎనిమిది గొరిల్లాలకు కరోనా.. మరికొన్ని కూడా తగ్గుతున్నాయ్..

బుధవారం, 13 జనవరి 2021 (07:14 IST)
అమెరికాలోని శాన్‌డియాగో నగరంలో ఉన్న సఫారీ పార్కులో గొరిల్లాలకు కరోనా సోకింది. జూలో ఒకే చోట కలిసి ఉంటున్న ఎనిమిది గొరిల్లాలకు పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, మరికొన్ని కూడా దగ్గుతున్నాయని పార్కు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ లీసా పీటర్సన్‌ చెప్పారు. గొరిల్లాలకు కరోనా సోకడం ఇదే తొలిసారి. వీటికి జూ వర్కర్ నుంచి వైరస్ సంక్రమించి ఉంటుందని భావిస్తున్నారు. 
 
కరోనా సోకిన ఆ రెండు గొరిల్లాలూ బాగానే ఉన్నాయని, ఆ రెండింటినీ క్వారంటైన్‌లో ఉంచామని కాలిఫోర్నియా గవర్నర్ తెలిపారు. త్వరలో ఇవి కోలుకుంటాయని భావిస్తున్నామన్నారు. మనుషులతో పోలిస్తే గొరిల్లాల డీఎన్ఏ 98% సరిపోలుతుంది. ఈ జూలోకి సందర్శకులకు ప్రస్తుతం అనుమతించడం లేదు.
 
ఇక కాలిఫోర్నియా రాష్ట్రంలో డిసెంబరు 6 నుంచి లాక్‌డౌన్‌ విధించడంతో ఈ పార్కు సైతం మూసే ఉంది. సందర్శకుల్ని అనుమతించడం లేదు. జూలో గొరిల్లాలకు దగ్గరగా పనిచేసే సిబ్బందిలో ఒకరు ఇటీవల కొవిడ్‌-19 బారినపడ్డారు. ఆ వ్యక్తి నుంచే వాటికి వైరస్‌ సోకి ఉంటుందని భావిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు