అత్యల్ప ఉష్ణోగ్రత వైరస్ వ్యాప్తికి అనుకూలంగా ఉండే అవకాశం ఉందని వారు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాబోయే కరోనా పీక్ స్టేజ్ను దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం అందుకు తగిన నివారణ చర్యలు ప్రారంభించింది. కరోనాతో తీవ్రంగా బాధపడుతున్నవారి కోసం ఆక్సిజన్ను అందుబాటులో ఉంచేందుకు లక్ష మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను విదేశాల నుంచి కొనుగోలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ఇటీవల జరిగిన క్యాబినెట్ మీటింగ్లో కరోనా బాధితులకు అవసరమయ్యే ఆక్సిజన్ విషయమై చర్చకు వచ్చింది. ప్రస్తుతం దేశంలో తగినంత స్థాయిలో ఆక్సిజన్ ఉందని, అయితే భవిష్యత్ అవసరాలకు మరింత ఆక్సిజన్ కావాల్సి ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం విదేశాల నుంచి లక్ష మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కొనుగోలు చేయాలని యోచిస్తోంది.