ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్, వైద్యులు జె.ఎన్ పాండేను పొట్టనబెట్టుకున్న కరోనా

శనివారం, 23 మే 2020 (19:26 IST)
కరోనా వైరస్ మరో ప్రఖ్యాత వైద్యుడిని పొట్టనబెట్టుకుంది. ఎయిమ్స్‌ ఢిల్లీ డైరెక్టర్‌, ప్రపంచ ప్రఖ్యాత పల్మనాలజిస్ట్‌, డాక్టర్‌ జేఎన్‌ పాండే కరోన వైరస్‌ సోకడంతో కన్నుమూశారు.
 
ఎయిమ్స్‌లో మెడిసన్‌ విభాగానికి ఆయన హెడ్‌గా కూడా పనిచేశారు. ఢిల్లీలో ఊపిరితిత్తులకు సంబంధించి ఏ అంశమైనా డాక్టర్‌ జేఎన్‌ పాండేదే తుది మాట. వ్యాధిని పసిగట్టడంలో ఆయనకు మించినవారు లేరంటారు. అంతటి నిష్ణాతులైన పాండే కరోనాతో మృతి చెందడంపై సహచర డాక్టర్లు, విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 

Deeply saddened to hear that today @covid19 claimed it's most illustrious victim Dr. J.N Pande Director & Prof of Pulmonology @aiims_newdelhi
A stalwart of the medical world his work in pulmonology will continue to ensure better health for many

My Condolences to his family

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు