మాజీ ప్రధాని దేవెగౌడ దంపతులకు కరోనా పాజిటివ్

బుధవారం, 31 మార్చి 2021 (14:01 IST)
మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ దంపతులకు కరోనా వైరస్ సోకింది. దేవగౌడతో పాటు.. ఆయన సతీమణి చెన్నమ్మలకు ఈ వైరస్ సోకినట్టు వైద్యులు వెల్లడించారు. ఈ దేవగౌడే స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 
 
ప్రస్తుతం ఇరువురు స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు దేవెగౌడ వెల్లడించారు. ఇటీవల తనతో సన్నిహితంగా ఉన్నవారు కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. పార్టీ కార్యకర్తలు, తన క్షేమం కోరేవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
 
మరోవైపు, దేవెగౌడ దంపతులు త్వరగా కోలుకోవాలని  దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు కోరుకుంటున్నారు. కాగా దేశంలో కరోనా సెకండ్ వేవ్ టెన్షన్ పెడుతోంది. వ్యాధి వ్యాప్తి ప్రమాదకరంగా పెరిగింది. మహారాష్ట్రలో అయితే పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది.
 
ఇదిలావుంటే, దేశంలో గ‌త 24 గంటల్లో 53,480 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న‌ 41,280 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,21,49,335కు చేరింది.
 
గడచిన 24 గంట‌ల సమయంలో 354 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,62,468కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,14,34,301 మంది కోలుకున్నారు. 5,52,566 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 6,30,54,353 మందికి వ్యాక్సిన్లు వేశారు.

 

My wife Chennamma and I have tested positive for COVID-19. We are self-isolating along with other family members.
I request all those who came in contact with us over the last few days to get themselves tested. I request party workers and well-wishers not to panic.

— H D Devegowda (@H_D_Devegowda) March 31, 2021

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు