దేశంలో కొత్తగా 26,506 కరోనా పాజిటివ్ కేసులు, 8 లక్షలకి చేరువలో..

శుక్రవారం, 10 జులై 2020 (11:24 IST)
భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతున్నది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసుల స్థాయి విపరీతమవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 26,506 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ బులెటిన్ తెలిపింది.
 
కేంద్ర ఆరోగ్యశాఖ వివరాల మేరకు దేశంలో మొత్తం 7,93,802 కేసులు నమోదయ్యాయి. ఇందులో యాక్టివ్ కేసులు 2,76,685 ఉండగా 4,95,512 మంది చికిత్సలో కోలుకొని డశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉండగా 21,604 మంది కరోనా వ్యాధితో మరణించారు.
 
గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,83,659 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు దేశంలో 1,10,24,491 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు