మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం: 25మంది మృతి

గురువారం, 11 ఫిబ్రవరి 2021 (21:46 IST)
దేశంలో కరోనా తీవ్రత తగ్గుతోంది. అలాగే మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో కొత్త కేసులు, మరణాల సంఖ్య తగ్గుతుంది. బుధవారం నుంచి గురువారం వరకు కొత్తగా 3,297 కరోనా కేసులు, 25 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,52,905కు, మరణాల సంఖ్య 51,415కు చేరింది. 
 
మరోవైపు గత 24 గంటల్లో 6,107 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 19,70,053కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 30,265 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది. కాగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్యలో మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు