సింగపూర్‌ నుంచి వచ్చిన మహిళకు కరోనా లక్షణాలు

సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (10:26 IST)
సింగపూర్‌, మలేసియా, దుబాయ్‌, మస్కట్‌, ఒమన్‌ సహా పలు దేశాల్లో లాక్‌డౌన్‌ కారణంగా చిక్కుకుపోయిన ప్రవాస భారతీయులను స్వదేశానికి రప్పించేలా కేంద్రప్రభుత్వం ప్రత్యేక విమానాలు నడుపుతోంది.

ఆ విమానాల్లో ప్రయాణం చేసేవారికి ఆయా దేశాలు కరోనా పరీక్షలు నిర్వహించి నెగిటివ్‌ వచ్చిన వారిని మాత్రమే ప్రయాణానికి అనుమతించాలని కేంద్రప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో సింగపూర్‌ నుంచి విమానంలో ఆదివారం ఉదయం తిరుచ్చికి వచ్చిన మహిళకు కరోనా లక్షణాలుండడం అధికారులను దిగ్ర్భాంతికి గురిచేసింది. 
 
ఆదివారం ఉదయం 7.30 గంటలకు సింగపూర్‌ నుంచి ఎయిర్‌ ఇండియా విమానం 169 మంది ప్రయాణికులతో తిరుచ్చి విమానాశ్రయానికి చేరుకుంది. ఆ విమానంలో ప్రయాణం చేసిన పుదుకోట జిల్లాకు చెందిన 38 ఏళ్ల మహిళకు కరోనా లక్షణాలున్నట్టు సర్టిఫికెట్‌లో ఉండగా, సదరు విమాన సంస్థ సిబ్బంది ఆమె ప్రయాణించేందుకు అనుమతించినట్టు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు