అక్టోబర్ 19న ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్ల సిరీస్ కోసం స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్తో సహా భారత వన్డే జట్టులోని ప్రముఖ సభ్యులు ఆస్ట్రేలియా చేరుకున్నారు. ఆస్ట్రేలియాకు చేరుకున్న వారి కోహ్లీ, రోహిత్, గిల్లతో పాటు, కె.ఎల్. రాహుల్, యశస్వి జైస్వాల్, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, కొంతమంది సహాయక సిబ్బంది ఉన్నారు.