హైదరాబాద్ ఎస్సార్ నగర్ పోలీసులు వెల్లడించిన వివరాల మేరరకు.. ఎర్రగడ్డ జనప్రియ అపార్టుమెంటులో నివసించే కాలువ శ్రీకాంత్ (30) అనే వ్యక్తి స్థానిక ప్రైవేట్ కళాశాలలో రెండేళ్లుగా గణితశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. కళాశాల సమయం ముగిసిన తర్వాత, ఇంటర్ చదువుతున్న కొందరు విద్యార్థినులకు పోటీ పరీక్షల కోసం ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాడు.
ఈ క్రమంలో విద్యార్థినుల ఫోన్ నంబర్లు సంపాదించి, ఇంటికి వెళ్లాక వారితో చాటింగ్ చేయడం ప్రారంభించాడు. ముఖ్యంగా ఎన్డీఏ వంటి పరీక్షల్లో శృంగారానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయని వారిని తప్పుదోవ పట్టించాడు. వాటి గురించి వివరిస్తాననే నెపంతో అసభ్యకరంగా మాట్లాడటం, చనువు పెంచుకుని లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు.
అతని వేధింపులు భరించలేని ఓ విద్యార్థిని ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు, అధ్యాపకుడు శ్రీకాంత్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.