2005-06లో గ్రెగ్ చాపెల్ కోచ్ నియామకంలో పరోక్షంగా తన పాత్ర ఉందని.. మళ్లీ కోచ్ ఎంపిక చేసే విషయంలో తనకు అవకాశం దక్కడం ఎంతో సంతోషంగా ఉందని సౌరవ్ తెలిపాడు. ఇంకా గంగూలీ మాట్లాడుతూ.. తన సహచరులు సచిన్, వీవీఎస్ లక్ష్మణ్లతో కలిసి కోచ్ను ఎంపిక చేసే బాధ్యతను అప్పజెప్పారు. ఇవన్నీ తన జీవితంలో చోటుచేసుకోవడం ఆశ్చర్యంగా ఉందని చెప్పుకొచ్చాడు.
కాగా భారత క్రికెట్ జట్టు కొత్త కోచ్ పదవి కోసం దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. గంగూలీ, సచిన్, లక్ష్మణ్ నేతృత్వంలోని బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీ 21 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూ తీసుకోనుంది. కాగా 24వ తేదీలోపు కోచ్ ఎంపిక పూర్తికావచ్చునని గంగూలీ వ్యాఖ్యానించాడు.