బంగ్లాదేశ్‌తో రెండో వన్డే.. రోహిత్ శర్మకు బొటన వేలికి గాయం

బుధవారం, 7 డిశెంబరు 2022 (13:23 IST)
rohit sharma
బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ గాయపడ్డాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ బొటనవేలికి దెబ్బ తగిలింది. 
 
బుధవారం మిర్పూర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు బొటనవేళ్లకు దెబ్బ తగలడంతో భారత క్రికెట్ జట్టుకు ఆందోళన తప్పలేదు. 
 
బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత మ్యాచ్ రెండో ఓవర్‌లో గాయం జరిగింది. మహ్మద్ సిరాజ్ వేసిన ఓవర్ నాల్గవ బంతికి, రెండో స్లిప్‌ వద్ద నిలబడిన రోహిత్‌ బంతిని క్యాచ్‌ చేసేందుకు ప్రయత్నించగా బొటన వేలికి గాయమైంది. 
 
అతడిని వెంటనే మైదానం నుంచి తప్పించి, అతని స్థానంలో రజత్ పటీదార్‌ని తీసుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు