భారత్ గడ్డపై ఆస్ట్రేలియా జట్టు ఓడిపోవడంపై ఆ దేశ మీడియా జీర్ణించుకోలేకపోతోంది. గతంలో కోహ్లీని ఏకిపారేసినట్లే.. మళ్లీ కోహ్లీపై ఆసీస్ మీడియా అక్కసును వెళ్లగక్కింది. కోహ్లీకి అహంకారం ఎక్కువని.. అందుకే దిగజారి ప్రవర్తించడంతో పాటు చిన్నపిల్లాడి వ్యవహరిస్తున్నాడని ఆసీస్ మీడియా ఘాటుగా విమర్శలు గుప్పించింది.
బీర్ పార్టీకి రావాలని కెప్టెన్ స్మిత్.. తాత్కాలిక కెప్టెన్ రహానేను కోరగా అందుకు రహానే అంగీకరించకపోవడాన్ని కూడా ఆస్ట్రేలియా మీడియా తప్పుపట్టింది. ఇక ధర్మశాల క్రికెట్ మ్యాచ్ పూర్తయిన వెంటనే కోహ్లీ మీడియా ముందు మాట్లాడిన వైనాన్ని ఆసీస్ మీడియా తప్పుబట్టింది. దీంతో కోహ్లీని టార్గెట్ చేస్తూ.. ఆస్ట్రేలియాకు చెందిన పలు మీడియా సంస్థలు ఫైర్ అయ్యాయి.