ఐసీసీ వన్డే ప్రపంచ కప్ : ఆస్ట్రేలియాకు మూడు వికెట్లు డౌన్

ఆదివారం, 19 నవంబరు 2023 (19:09 IST)
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా, ఆదివారం అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోడీ స్టేడియంలో జ‌రుగుతున్న‌ వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్లో భార‌త్, ఆస్ట్రేలియా జట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. నిర్ణీత 50  ఓవర్లలో 240 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఆసీస్‌ ఛేదనకు దిగింది. 
 
వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో భారత జట్టు నిర్దేశించిన 241 పరుగులతో బరిలోకి దిగిన ఆసీస్‌.. ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టింది. డేవిడ్‌ వార్నర్‌, ట్రావిస్‌ హెడ్‌లు ఓపెనర్లుగా వచ్చి ఆసీస్‌ ఛేదనను మొదలుపెట్టారు. తొలి ఓవర్లోనే బుమ్రా బౌలింగ్‌లో.. హెడ్‌ రెండు బౌండరీలు కొట్టగా వార్నర్‌ ఒక ఫోర్‌ కొట్టాడు.
 
భారత పేసర్ మహ్మద్‌ షమీ భారత్‌కు తొలి బ్రేకిచ్చాడు. తన తొలి ఓవర్లోనే మహ్మద్‌ షమీ.. డేవిడ్‌ వార్నర్‌ (7)ను ఔట్‌ చేశాడు. ఆఫ్‌స్టంప్‌కు ఆవలగా వెళ్తున్న బంతిని ఆడబోయిన వార్నర్‌.. ఫస్ట్‌ స్లిప్‌లో కోహ్లీకి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఈ వరల్డ్‌ కప్‌లో షమీకి ఇది 24వ వికెట్‌. వరల్డ్‌ కప్‌ 2023లో అత్యధిక వికెట్ల తీసిన బౌలర్ల జాబితాలో షమీ స్థానం దక్కించుకున్నాడు. 
 
ఆ తర్వాత షమీ వేసిన రెండో ఓవర్లో ఆసీస్‌ డేవిడ్‌ వార్నర్‌ వికెట్‌ కోల్పోయింది. అతడి స్థానంలో వచ్చిన మిచెల్‌ మార్ష్‌ కూడా భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. తాను ఎదుర్కున్న రెండో బంతికే కవర్‌ పాయింట్‌ మీదుగా ఫోర్‌ కొట్టిన మార్ష్‌.. షమీనే వేసిన నాలుగో ఓవర్లో లాంగాఫ్‌ మీదుగా భారీ సిక్సర్‌ కొట్టాడు. 
 
ఆ క్రమంలో ఆసీస్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. ఆస్ట్రేలియా  టాపార్డర్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌ కూడా వెనుదిరిగాడు. దీంతో ఆసీస్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. ఈ వికెట్‌ కూడా బుమ్రాకే దక్కింది. బుమ్రా వేసిన ఏడో ఓవర్లో ఆఖరి బంతికి స్మిత్‌ వికెట్ల ముందు దొరికిపోయాడు. ఏడు ఓవర్లకు ఆసీస్‌.. మూడు వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు