బంగ్లాదేశ్‌తో తొలి వన్డే మ్యాచ్ : భారత్ 186 ఆలౌట్

ఆదివారం, 4 డిశెంబరు 2022 (15:18 IST)
ఆతిథ్య బంగ్లాదేశ్ జట్టుతో భారత్ ఆదివారం తొలి వన్డే మ్యాచ్‌లో తలపడింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్... కేవలం 41.2 ఓవర్లలో 186 పరుగులకే ఆలౌట్ అయింది. బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబ్‌కు ఐదు వికెట్లు తీయగా, ఇబాదత్ నాలుగు వికెట్లు కూల్చాడు. 
 
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం తొలి వన్డే జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత ఆటగాళ్లు పూర్తిగా విఫలమయ్యారు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ షకీబల్ హాసన్‌ దెబ్బకు భారత ఆటగాళ్లు తలవంచారు. మరోవైపు, ఇబాదత్ హుస్సేన్ కూడా అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్‌తో నాలుగు వికెట్లు కూల్చాడు. దీంత భారత్ బ్యాటర్లు తలవంచారు. 
 
ఫలితంగా 41.2 ఓవర్లలో 186 పరుగులకే ఆలౌట్ అయింది. భారత ఆటగాళ్లలో అత్యధికంగా కేఎల్ రాహుల్ 73 పరుగులు చేయగా, కెప్టెన్ రోహిత్ శర్మ 27, శ్రేయాస్ అయ్యర్ 247, ఓపెనర్ శిఖర్ ధావన్ 7 చొప్పున పరుగులు చేశాడు. 
 
ఒకే ఓవర్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (9) వికెట్లను షకీబ్ నేలకూల్చాడు. ఆ తర్వాత భారత్ ఏ దశలోనూ కోలుకోలేక పోయింది. వాషింగ్టన్ సుందర్ కూడా 19 పరుగులు చేసి షకీబ్ బౌలింగ్‌లోనే ఔట్ అయ్యారు. మెహిదీ హాసన్‌కు ఓ వికెట్ దక్కింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు