6,4,4,0,4,1 బౌండరీలతో చెలరేగిపోయిన శాంసంగ్.. ఇంకో ధోనీ దొరికాడా?

శనివారం, 8 అక్టోబరు 2022 (15:00 IST)
Sanju Samson
లక్నో వేదికగా సఫారీలతో జరిగిన తొలి వన్డేలో భారత్ జట్టు 9 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. 40 ఓవర్ల మ్యాచ్‌లో 250 పరుగుల టార్గెట్‌ను చేధించే క్రమంలో బరిలోకి దిగిన టీమిండియాకి ఆదిలోనే సఫారీలు కళ్లెం వేశారు. 8 పరుగులకే భారత ఓపెనర్లు పెవిలియన్ చేరారు. 
 
ఆ తర్వాత వచ్చిన గైక్వాడ్(19), ఇషాన్ కిషన్(20) కూడా తక్కువ పరుగులకే ఔట్ కావడంతో వికెట్ కీపర్ సంజూ శాంసన్(86) టీం భారాన్ని తన భుజాలపై వేసుకున్నాడు. అతడికి శ్రేయాస్ అయ్యర్(50) తోడవ్వడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. 
 
అయితే అర్ధ సెంచరీ చేశాక అయ్యర్ ఔట్ కావడంతో.. ఆ తర్వాత్ రెగ్యులర్ ఇంటెర్వల్స్‌లో భారత్ వికెట్లు కోల్పోవడంతో.. విజయానికి చివరి ఓవర్‌లో టీమిండియా 30 పరుగులు చేయాల్సి ఉంది. ఇక అప్పుడే శాంసన్.. తన పవర్ హిట్టింగ్ చూపించాడు. 6,4,4,0,4,1 బౌండరీలతో చెలరేగిపోయాడు. దీంతో టీమిండియాకు మరో ధోనీ దొరికాడని క్రీడా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. 
 
కాని చివరికి టీమిండియా 9 పరుగుల తేడాతో ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 40 ఓవర్లకు 4 వికెట్లు నష్టపోయి 249 పరుగులు చేసింది. డికాక్(48), క్లాసన్(74), మిల్లర్(75) రాణించడంతో ఆ జట్టు గౌరవప్రదమైన స్కోర్ చేరుకోగలిగింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు