ఫిట్నెస్ సాధించిన జాదవ్.. అంబటికి మొండిచేయి.. వరల్డ్ కప్ ఫైనల్ టీమ్ ఇదే..

మంగళవారం, 21 మే 2019 (09:40 IST)
ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా ఈ నెల 30వ తేదీ నుంచి ప్రపంచ క్రికెట్ పోటీలు జరుగనున్నాయి. ఈ పోటీల కోసం భారత క్రికెట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. మొత్తం 15 మందితో జట్టును పంపించింది. ఆ తర్వాత మరో ఇద్దరు ప్లేయర్లను స్టాండ్‌బైగా తీసుకుంది. అయితే, బీసీసీఐ తొలుత ప్రకటించిన జట్టునే ప్రపంచ కప్ పోటీలు అడేందుకు తుది జట్టుగా ఖరారు చేసింది. 
 
ముఖ్యంగా, ఐపీఎల్ 11వ సీజన్ పోటీల్లో గాయపడిన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కేదార్ జాదవ్‌ తిరిగి ఫిట్నెస్ సాధించడంతో అతనికి తుది జట్టులో స్థానం కల్పించింది. జాదవ్ జట్టులోకి రావడంతో హైదరాబాద్ కుర్రోడు అంబటి రాయుడుకు తుది జట్టులో స్థానం లేకుండా పోయింది. ఫలితంగా రాయుడు తీవ్ర నిరాశకు లోనయ్యాడు. 
 
బీసీసీఐ ప్రకటించిన తుది జట్టులోని సభ్యుల వివరాలను పరిశీలిస్తే, విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, విజయ్ శంకర్, మహేంద్ర సింగ్ ధోనీ (వికెట్ కీపర్), కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్ (సెకండ్ వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు