ప్రేమజంట మృతి కాకినాడలో సంచలనం సృష్టిస్తోంది. సామర్లకోట మండలం, పనసపాడులో ఈ ఘటన వెలుగు చూసింది. యువతి మృతదేహం పనసపాడు శివారులోని ఆలయం వద్ద లభ్యమవగా.. ఆమె ఒంటిపై గాయాలు, కత్తిపోట్లతో గల మృత దేహాన్ని పోలీసులు గుర్తించారు.
యువకుడి మృతదేహాం హుస్సేన్పురం రైల్వే ట్రాక్ దగ్గర లభ్యమైంది. మృతులను గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామానికి చెందిన దీప్తి, అశోక్గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.