పెవిలియన్ బాల్కనీ కూర్చుని.. కునుకు తీసిన తీసిన రవిశాస్త్రి (video)

మంగళవారం, 22 అక్టోబరు 2019 (11:17 IST)
భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరుగుతోంది. ప్రస్తుతం రాంచీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్ విజయం ఖాయమైంది. దీంతో టీమిండియా సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేయనుంది. ఇదిలా ఉంటే.. మూడో టెస్ట్‌ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. టీమిండియా హెడ్ కోచ్‌ రవిశాస్త్రి పెవిలియన్‌ బాల్కనీలో కూర్చోని కునుకు తీస్తున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.
 
సోమవారం మూడు టెస్ట్ మ్యాచ్ జరుగుతుండగా.. ఓ సమయంలో రవిశాస్త్రి కునుకు తీసాడు. ఈ సన్నివేశాలు కెమెరాలకు చిక్కాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఫోటోలలో రవిశాస్రి వెనకాలే కూర్చున్న యువ ఆటగాడు శుబ్‌మన్‌ గిల్‌ కోచ్‌ను చూస్తున్నట్లు కనిపిస్తోంది.
 
ఇదిలా ఉంటే.. ఇటీవల రెండోసారి భారత హెడ్ కోచ్‌గా ఎంపికైన రవిశాస్త్రి 2021లో జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌ వరకూ ఆ పదవిలో ఉండనున్నాడు. రవిశాస్త్రి జీతాన్ని బీసీసీఐ మరో 20 శాతం పెంచింది. కాగా వన్డే ప్రపంచకప్‌ ఓటమి నేపథ్యంలో రవిశాస్త్రిపై వేటు పడుతుందని అంతా ఊహించారు. కానీ.. బీసీసీఐ మళ్లీ అతడికే పట్టం కట్టింది.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు