అక్రమ రవాణాకు గురైన బంగ్లాదేశ్కు చెందిన 20 ఏళ్ల మహిళను కూడా అదే ప్రదేశం నుండి పోలీసులు రక్షించారు. మొహమ్మద్ ఖలీద్ బాపారి, జుబెర్ షేక్, షామిన్ సర్దార్ అనే ముగ్గురు బంగ్లాదేశ్ జాతీయులను పోలీసులు అరెస్టు చేశారు. పాఠశాల పరీక్షలో విఫలమైన తర్వాత, భయంతో ఇంటి నుండి పారిపోయిన బాలికను ఆమె గ్రామానికి చెందిన మీమ్ అనే మహిళ ఈ రొంపిలోకి దింపేసిందని మహారాష్ట్ర రాష్ట్ర మైనారిటీ కమిషన్ మాజీ ఉపాధ్యక్షుడు డాక్టర్ అబ్రహన్ మథాయ్ అన్నారు.
ఆ బాలికను సరిహద్దు దాటి కోల్కతాకు అక్రమంగా రవాణా చేశారని, అక్కడ నకిలీ ఆధార్ కార్డు తయారు చేశారని, ఆమెను ముంబైకి తరలించి, ముంబై సమీపంలోని నైగావ్లో బందీగా ఉంచారని ఆయన అన్నారు. “నైగావ్లో ఆమె ఒక వృద్ధుడు, అతని భార్యతో పాటు 7 నుండి 8 మంది బాలికలతో నివసించింది.
ఒక రోజు ఆ వృద్ధుడు ఆమెకు ఇంజెక్షన్ ఇచ్చి అత్యాచారం చేశాడు. అప్పటి నుండి ఆమె అనుమతి లేకుండా ఆమెను చాలా మంది తెలియని కస్టమర్లకు ఇచ్చాడని హార్మొనీ ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆ ప్రాంగణంలో, బాలికకు మాదకద్రవ్యాల ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత లైంగిక దోపిడీకి గురయ్యారని పేర్కొంది.