ఎంపీ ప్రియా సరోజ్‌లో క్రికెటర్ రింకూ సింగ్ వివాహం వాయిదా!

ఠాగూర్

మంగళవారం, 24 జూన్ 2025 (19:15 IST)
భారత క్రికెటర్ రింకూ సింగ్ వివాహం సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఎంపీ ప్రియా సరోజ్‌తో జరుగనుంది. వీరిద్దరి నిశ్చితార్థం ఈ నెల ఆరంభంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ, సినీ, క్రీడా రంగ ప్రముఖులు హాజరయ్యారు. అలాగే, వీరిద్దరి వచ్చే నవంబరు 19వ తేదీన జరగాల్సివుంది. అయితే, రింకూ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ సిరీస్‌లతో బిజీగా మారనున్నారు. దీంతో వీరి వివాహం వచ్చే యేడాదికి వాయిదా వేశారు. 
 
రింకూ సింగ్ రాబోయే కొన్ని నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లతో బిజీగా ఉండనున్నారు. ఈ కారణంగా వివాహాన్ని వాయిదా వేసినట్టు తెలుస్తోంది. నవంబరు నెలలో రింకూ సింగ్ భారత జట్టు తరపున ఆడాల్సి ఉండటంతో, ఇరు కుటుంబాల సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 2025 నవంబరు 19వ తేదీన రింకూ, ప్రియల వివాహం కోసం వారణాసిలోని తాజ్ హోటల్‌ను కుటుంబ సభ్యులు బుక్ చేశారు. అయితే, భారత క్రికెట్ జట్టుతో రింకూకు ఉన్న కమిట్‌మెంట్ల కారణంగా వివాహాన్ని వాయిదా వేయాల్సి వచ్చినట్టు జాతీయ మీడియా కథనాల సమాచారం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు