తెలంగాణ త్రిష అదుర్స్.. అండర్-19- టీ-20 ప్రపంచ కప్.. సూపర్ సిక్స్ లో టీమిండియా

గురువారం, 19 జనవరి 2023 (18:25 IST)
Telangana Trisha
స్కాట్లాండ్‌పై బుధవారం జరిగిన మ్యాచ్ లో 83 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా ప్రారంభ ఐసీసీ అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్‌లో సూపర్ సిక్స్ రౌండ్‌లో చోటు దక్కించుకుంది. ఈ విజయం గతంలో లీగ్ దశలో దక్షిణాఫ్రికా- యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లను ఓడించి గ్రూప్-డీలో అగ్రస్థానంలో ఉన్న భారత్ స్థానాన్ని పటిష్టం చేసింది. 
 
తెలంగాణ రాష్ట్రానికి చెందిన గొంగడి త్రిష టీమిండియాకు ప్రత్యేకంగా నిలిచిన క్రీడాకారిణి. ఆమె 51 బంతుల్లో ఆరు ఫోర్లతో సహా 57 పరుగులు చేసి అసాధారణ ఫామ్‌ను ప్రదర్శించింది. ఇప్పటి వరకు టోర్నీలో టాప్ స్కోరర్‌గా నిలిచింది. 
 
స్టార్ ఓపెనర్ షెఫాలీ వర్మ ప్రారంభంలోనే ఔటైనప్పటికీ, త్రిష భారత్‌కు బలమైన ఆరంభాన్ని అందించింది. త్రిష స్కాట్లాండ్ ఆటగాళ్లను ఆత్మవిశ్వాసాన్ని దెబ్బకొట్టింది. 
 
దృఢ సంకల్పంతో, స్కాట్లాండ్‌ను ఓడించి, టోర్నమెంట్‌లోని సూపర్ సిక్స్ రౌండ్‌లో స్థానం  సంపాదించడంలో భారత్‌కు సహాయపడడంలో ఆమె ఇన్నింగ్స్ కీలక పాత్ర పోషించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు