భారత క్రికెట్ జట్టు అదుర్స్.. బంగ్లాపై 110 పరుగుల తేడాతో గెలుపు

మంగళవారం, 22 మార్చి 2022 (23:13 IST)
భారత మహిళా క్రికెట్ జట్టు మహిళల ప్రపంచకప్‌లో అదరగొట్టింది. భారత జట్టు తన ప్రత్యర్థి బంగ్లాదేశ్ జట్టును మట్టి కరిపించింది. బ్యాటింగ్, బౌలింగ్ లోనూ రాణించి బంగ్లాదేశ్ పై 110 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. 
 
టాస్ గెలిచిన భారత మహిళల జట్టు ముందు బ్యాటింగ్ తీసుకుంది. యస్తిక భాటియా మరోసారి రాణించి 50 పరుగులు సాధించగా.. ఓపెనర్లు స్మృతి మందన 30, షఫాలి వర్మ 42 పరుగులు రాబట్టారు. 
 
వీరికి పూజ వస్త్రాకర్, స్నేహ్ రాణా మద్దతుగా నిలవడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి 229 పరుగులు సాధించింది. రితుమోని కూడా రాణించి మూడు వికెట్లు తీసింది. నహీదా అక్తర్ 2 వికెట్లు తీసింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా యస్తిక భాటియా ఎంపికైంది.
 
అనంతరం 230 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ జట్టును భారత బౌలర్లు కట్టి పడేశారు. బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ వెన్ను విరిచేలా స్నేహ్ రాణా బౌలింగ్ తో విరుచుకుపడింది. పూజ వస్త్రాకర్, జులాన్ గోస్వామి సైతం 2 వికెట్ల చొప్పున పడగొట్టారు. దీంతో 40.3 ఓవర్లకే 119 పరుగులకు ఆల్ అవుట్ అయింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు