భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య చెన్నయ్లో ప్రారంభమైన తొలి క్రికెట్ టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ బ్యాంటింగ్ ఎంచుకున్నాడు. 15 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ జట్టు వికెట్ నష్టపోకుండా 34 పరుగులు చేసింది. ఓపెనర్లు ఎ స్ట్రాస్ 42 బంతుల్లో 14 పరుగులు, ఎ కుక్ 50 బంతుల్లో 20 పరుగులు చేసి క్రీజులో నిలదొక్కుకున్నారు.
ముంబై దాడుల అనంతరం చివరి రెండు వన్డేలు ఆడకుండానే స్వదేశానికి పయనమైన ఇంగ్లండ్ జట్టు, భారీ భద్రత హామీతో టెస్టు మ్యాచ్లకు హాజరు కావడానికి సమ్మతించింది. వర్షం కారణంగా ఇరు జట్లకు ప్రాక్టీస్ మ్యాచ్కు వీలు కుదరలేకపోవడంతో నేరుగా బరిలోకి దిగాయి. చెన్నయ్లో తొలి రెండు రోజులూ వర్షం కురిసే అవకాశం ఉంటుందని ప్రకటించినా ఆట నిరంతరాయంగా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.